Saturday, June 24, 2023
ది.23-6-2023 మాజీ మంత్రివర్యులు గాదె వెంకట రెడ్డి గారి తనయులు బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు విచ్చేసి నియోజక వర్గ స్థాయిలో 2022-23 S.S.C పరీక్షలలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన జగనన్న ఆణిముత్యాలు షేక్ ఖదిరా కు 15,116/- లు షేక్ జాస్మిన్ కు 10,116/- లు ప్రోత్సాహక బహుమతులను అందించి ప్రధానఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో సన్మానించి అభినందించి, విద్యార్థులు చిన్నతనం నుండి ఇంగ్లీష్ భాషలో వాక్ నైపుణ్యం పెంపొందించుకొని పై చదువులలో ఇప్పుడు పొందిన స్థానాలను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. వక్తలు మాట్లాడుతూ గడచిన కాలంలో గాదె వెంకట రెడ్డి గారు చందోలు గ్రామంలోని ఈ పాఠశాల మరియు కళాశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు, ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కే.మురళీధర్ రావును మరియు,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయు లను ఘనంగా సన్మానించారు గ్రామ పెద్దలతో కలిసి ప్రభుత్వ. బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు తదనంతరం పాఠశాల అభివృద్ధి కమిటీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి గాదె మధుసూదన రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ తిథులు, మస్తాన్ బేగ్, రఫీ, గిరిజారాణి,డేగల రవి రెడ్డి, మారు బోయిన శ్రీనివాస్ రెడ్డి,జి.ఆనంద్ రావు,దోమ నాగేశ్వర రెడ్డి,మద్దాల డేవిడ్,కె.ఏ.పాల్ కుంచల వీర రాఘవరెడ్డి,సయ్యద్ నూరుల్లా, గాదె అభిమానులు,గాదె యువసేన మరియు తదితర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
-
-
https://youtu.be/vltzIDDIPkc
-
-
-



No comments:
Post a Comment